Wednesday, December 2, 2009

అమర వీరుల త్యాగం వృధా కానివ్వొద్దు


1969లో 370 మంది వీరుల త్యాగాన్ని తెలంగాణ ఎప్పుడో మరిచిపోయింది. (ఒకవేళ మరవకుండా ఉంటే ఈపాటికి తెలంగాణ వచ్చి ఉండేదే). కానీ ఈసారైన ఉద్యమంలో చనిపోయిన వీరుల త్యాగం వృధా కానివ్వొద్దు. మొదటగా చనిపోయిన తెరాస సానుభూతి పరుడు నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంత్, నిజామాబాద్ జిల్లా కు చెందిన పోలీసు కానిస్టేబుల్ కిష్టయ్య, మరొక పదవ తరగతి విద్యార్థి మృతి ని వృధా కానివ్వొద్దు.

అయితే ప్రభుత్వ నిర్భందం ఎప్పుడూ ఉన్నట్టే ఇప్పుడూ ఉంటుంది. ఉద్యమాన్ని మలినం చేసే కుట్రలు ఇప్పుడూ జరుగుతాయి. వీటన్నింటినీ మరియుగత అనుభవాలను దృష్టి లో పెట్టుకుని సమైక్య నాయకత్వంలో ముందుకు కదిలి తెలంగాణ సాధించుకోవాలి.

జై తెలంగాణ - జాగో తెలంగాణ

No comments:

Post a Comment