Monday, December 7, 2009

రాజధాని మం(కం)త్రులు

హైదరాబాద్ కు చెందిన ఇద్దరు మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ లు నిన్న కాంగ్రెస్ లెజిస్లెచర్ మీటింగ్ లో ఒక తెలివి తక్కువ వాదాన్ని లేవనెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఈ ఇరువురూ నాయకులు(?) కోరారు. దీన్ని తెలివి తక్కువ వాదం అనేకన్నా కుట్ర పూరిత ఉద్దేశం అని అనవచ్చు. అయితే దీని వెనక ఎవరున్నారో, ఎలాంటి కుట్ర దాగున్నదో అందరికి తెలిసిందే. హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాలైన రంగా రెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ లలోని ప్రాంతాలని కలుపుకుని గ్రేటర్ హైదరాబాద్ ఎందుకు ఏర్పాటు చేసారో అందరికి తెలిసిందే.

వాళ్ళు సంపాదించిన ఆస్తులను తెలంగాణా వచ్చినా కాపాడుకునే ప్రక్రియ లో భాగమే గ్రేటర్ హైదరాబాద్, రింగ్ రోడ్ లు. ఈ ఇరువురూ నాయకులు సంపాదించుకున్న(?) ఆస్తులను కాపాడుకోవటం కన్నా తమ వెనక ఉన్న తమ రింగ్ మాస్టర్ల ప్రయోజనాలను కాపాడటమే అధికం. 400 ఏళ్ల క్రిందటే స్వయం ప్రతిపత్తి కలిగిన హైదరాబాద్ రాష్ట్రాన్ని తెలంగాణ నుంచి వేరు చేయాలనే కుహాన వాదమే ఇది. ఇప్పుడున్న పరిస్థితులలో అనివార్యమైన తెలంగాణ ను సాధ్యమైనంత అడ్డుకోవడమే లేదా ఏర్పాటు ను ఆలస్యం చేయడమే ఈ వ్యాఖ్య ల వెనక ఉన్న అసలు కుట్ర.

No comments:

Post a Comment