సుప్రీం కోర్టు లో ఉద్దేశ పూర్వకంగా కేసు ని ఓడిపోయిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటివరకు ఇది తమ పరిధి లో లేదు అని చెప్తూ వస్తున్న పాలకులు నేడు కంటి తుడుపు చర్య గా కుట్ర పూరిత ప్రకటన చేసింది. అయితే హటత్తుగా తెలంగాణా ఉద్యోగుల పై ప్రభుత్వానికి ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చింది అనుకుంటున్నారా? దీనిలో దాగున్న కుట్ర ఏంటంటే రేపటి నుంచి ఉద్యోగులు చేయదల్చిన నిరవధిక పెన్ డౌన్ ను ఆపటo తో పాటు ఉద్యోగులను ఉద్యమం నుంచి వేరు చేయడమే.
గత నెలలో సిద్దిపేట లో ఉద్యోగులు సమావేశం నిర్వహించి ఎంతగా మొత్తుకున్నా పెడచెవిన పెట్టిన ప్రభుత్వం నేడు వారిని ఎమార్చాలని ప్రయత్నిస్తుంది. అయితే ఉద్యోగులను ఈ ప్రభుత్వ ఉచ్చు లో పడవద్దని, ఇప్పుడు ఫ్రీజోన్ అంశమే కాకుండా తెలంగాణ కూడా నిర్ణయాత్మక దశకు చేరుకున్నందున బెట్టు వీడవద్దని మేధావులు కోరుకుంటున్నారు.
ఇక రెండో బహుమతి గురించి చెప్పుకుందాం. కేసీఆర్ పై పెట్టిన కేసులు ఎత్తివేయడం. పెట్టిన కేసులే కుట్ర పూరితమైనవి అయినప్పుడు మళ్ళీ వాటిని ఎత్తివేయడం అంటే అంతకన్నా మోసం ఇంకోటి లేదు. ఒక పార్లమెంట్ సభ్యుడు, ముప్పై ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న నాయకుడు, ఒక్కటంటె ఒక్క క్రిమినల్ కేస్ లేని ప్రజా ప్రతినిధి అని చూడకుండా గ్రేహౌండ్స్ దళాలను దింపి ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష అయిన తెలంగాణ ఏర్పాటు కోసం రాజ్యాంగం కల్పించిన హక్కు అయిన శాంతియుత పద్దతి లో నిర్వహించ తలబెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేయడమే కాకుండా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా ఖమ్మం జైల్ లో పెట్టి రాజద్రోహ కేసు ను పెట్టింది ఈ దుష్ట ప్రభుత్వం.
చనిపోయిన రాజశేఖర్ రెడ్డి పై ఎప్పుడో చేసిన మత కలహాల అభియోగాన్ని మోపి (ముందు పత్రికలకు చెప్పిన కారణం ఇదే) కేసు బనాయించటం అంటే అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. ఇదే విషయమై గతంలో ఎంతో మంది వైఎస్ ను అన్నారు. వీటన్నింటినీ విస్మరించి ఈ కేసు ను పెట్టటమంటే దాని వెనక ఉన్న శక్తులు ఎవరో మనం సులభం గా ఊహించగలం.
అయితే వీటి వెనక ఉన్న మరొక నిగూఢ కుట్ర ఏంటంటే, కార్యకర్తల పై పెట్టిన కేసుల గురించి మాట్లాడకుండా నాయకుడి కేసుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు అంటే కార్యకర్తలకు, నాయకుడికి మధ్య అంతరాన్ని సృష్టించడమే. ఇన్ని కుట్ర లకు మధ్య మనల్ని మనం కాపాడుకుంటూ, మన నాయకుడిని కాపాడుకోవాల్సిన భాద్యత ఉంది. తద్వారా ఉద్యమాన్ని కాపాడుకుంటూ తెలంగాణ సాధించుకోవాలని కోరుకుంటూ...
- తెలంగాణ భూమీపుత్ర
No comments:
Post a Comment