Thursday, December 3, 2009

మేము సైతం తెలంగాణ సాధన కోసం.....

మేము సైతం తెలంగాణ సాధన కోసం అంటూ ముందుకు వస్తున్నారు నేడు అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు చెందిన సామాన్యులు. ముందు ఒక పార్టీ కార్యక్రమం గా ప్రారంభమైన ఈ పోరాటం నేడు అనూహ్యమైన మలుపు తీసుకుంది. అన్ని వర్గాలకు చెందిన సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. దానికి నిదర్శనమే ఈ క్రింది కొన్ని మచ్చు తునకలు.


  • కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో బట్టలు ఉతక వద్దని నిర్ణయించిన ఇల్లందు రజక సంఘం. దీనిని అంతటా స్పూర్తిగా తీసుకోవాలని తెలంగాణ విద్యావంతుల వేదిక అభ్యర్థన. వీరి బాటలో నడవనున్న నాయి బ్రాహ్మణులు.
  • తెలంగాణ కోరుతూ ఆటో ల బంద్‌కు పిలుపునిచ్చిన వరంగల్ ఆటోవాలాలు. వీరి బాటలో నడవనున్న హైదరాబాద్ ఆటో డ్రైవర్లు.
  • అన్ని తెలంగాణ జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులు.
  • ప్రభుత్వం విద్యార్థులకు ప్రకటించిన సెలవుల్లో తెలంగాణ పాఠాలు చెప్తాం - లెక్చరర్లు.
  • పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని వి. హెచ్. హనుమంతరావు ఇంటి ని ముట్టడించిన ఉస్మానియా విద్యార్థులు.
  • తెలంగాణ అంతటా అయ్యప్ప స్వాముల భారీ ప్రదర్శనలు. పరిగి లో స్వాములను అరెస్ట్ చేసిన పోలీసులు.
  • ప్రత్యేక తెలంగాణ కోరుతూ నిజామాబాద్ లో చిన్నారుల రిలే నిరాహార దీక్షలు.
  • మంచిర్యాల లో న్యాయవాదుల మానవ హారం.
  • 118మంది తెలంగాణ ద్రోహుల దిష్టి బొమ్మలు తగులబెట్టి, పోర్లు దండాలు పెట్టిన ఉస్మానియా విద్యార్థులు.
  • కరీంనగర్ జిల్లా లో అగ్ని గుండం లో నడిచిన గ్రామస్థులు.

అయితే ఇవేం పట్టని అధికార కాంగ్రెస్ పార్టీ మేయర్ ఎన్నికలో నిమగ్నమై ఉండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం కు నేడు ఓబులపురమే ముఖ్యమైన ఘటన. వీరికి గట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది.....

జై తెలంగాణ ! జాగో తెలంగాణ !!


No comments:

Post a Comment