1953 లో మాకు ఇష్టం లేకున్నా రాష్ట్రాన్ని ఏకం చేసి అయిదు సంవత్సరాల గడువు పెట్టిన ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పెద్ద మనుషుల ఒప్పందాన్ని ప్రతిపాదించారు. అది అలా ఢిల్లీలో ప్రకటించి ఆనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ వచ్చే సరికి తూట్లు పొడిచారు. ఆ ఒప్పందం ప్రకారం ఉప ముఖ్యమంత్రి పదవి ని తెలంగాణకు ఇవ్వాల్సి ఉండగా దాన్ని ఆరో వేలు అంటూ కొట్టి పారేసీన ఆంధ్ర పాలకుల అహంకారానికి తొలి అడుగు అక్కడే పడింది. దీనికి తెలంగాణ నాయకుల చేతకానితనం తోడయ్యింది.

ఆ తరవాత వరస మోసాలు, ఆరు సూత్రాల పథకాన్ని కూడా పదహారో వేలు కింద తీసి పారేశారు. 1985 లో 610 జీవో అయితే రాష్ట్రంలో అమలు కాకుండా మరుగున పడి ఉన్న అతి పురాతన జీవో. ఇంకా కొన్ని రోజుల్లో ఈ జీవో గిన్నిస్ బుక్ లో కి ఎక్కిన ఆశ్చర్యపోనవసరం లేదు. వీటన్నింటికి తోడు కొత్తగా హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే కొత్త కుట్ర కు తెర లేపారు. అరాచకాలు ఎక్కువ కాలం భరించ లేరు అన్న విధంగా దీనితో 40 ఏళ్లకు మళ్లీ ఒకసారి విప్లవం వచ్చింది. కేసీఆర్ నిరాహార దీక్షను తక్కువ అంచనా వేసి ప్రభుత్వం దెబ్బ తిన్నది. ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఆగ్రహానికి భయపడి తెలంగాణ పై ప్రకటన చేసింది.
దీనితో ఇంకొక కొత్త డ్రామాకు తెర లేచింది. అప్పటి వరకు ఉప్పు నిప్పు అన్న చందాన ఉన్న నాయకులు, తెలంగాణ ఎక్కడ ఏర్పడుతుందో తమ దోపిడీ కి ఎక్కడ తెర పడుతుందో అని పాంట్లు, పంచెలు ఎగ్గట్టి రంగంలోకి దూకారు. అర్ధరాత్రి నిర్ణయం పేరు మీద తెల్లారే సరికి పోటీలు పడి రాజీనామాలు చేసి ఆ తరవాత జనాలను రోడ్ల మీదకు లాగి దాన్నే ప్రజా ఉద్యమం గా మలచాలని ప్రయత్నించటం చూస్తుంటే నవ్వొస్తుంది. రాజీనామాలు చేసిన కొన్ని గంటలకు గాని తేరుకొని సామాన్య జనం ఈ ఉద్యమాన్ని తమ ఖాతా లోకి నెట్టేసరికి పాలు పోక వాళ్ళూ రోడ్డెక్కారు. ఇక సమైక్యం సమైక్యం అంటూ ఏకపక్షంగా కురిపించే ప్రేమ కు తెలంగాణ ప్రజలు ఖంగు తింటున్నారు.

ఇక ఈ ఉద్యమాన్ని(?) హైజాక్ చేయడానికి పోటీలు మొదలయ్యాయి. లగడపాటి నుంచి జగన్ వరకు, దివాకర్ రెడ్డి నుంచి వివేకానందరెడ్డి వరకు పోటీలుపడి రాజీనామాలు, ధర్నాలు , నిరాహారదీక్షలు మొదలు పెట్టేశారు. అయితే ప్రజలు ఇవేమీ తెలియని పిచ్చి వాళ్ళు కారు. వాళ్ళు మౌనంగా ఉన్నంతసేపే మంచి వాళ్ళు. అయితే సగటు సీమాంధ్ర పౌరులకు తెలంగాణ వేరు పడినా, మళ్లీ తెల్లవారి పాలనలోకి వెళ్ళినా తేడా ఏమీ ఉండదు. వచ్చిన చిక్కల్లా కంత్రి, కుహాన, కరడు గట్టిన సమైక్య రాజకీయ నాయకులతోనే....
No comments:
Post a Comment