Saturday, December 19, 2009

తెలంగాణ కు పట్టిన తెగులు తెలుగుదేశం పార్టీ

ఆయన పేరు నాగం జనార్ధన్ రెడ్డి, ఇప్పుడు పార్టీలో నంబర్ టూ(?) అని అంటారు. కాంగ్రెస్ వాళ్ళు, గిట్టని వాళ్ళు బియ్యం రెడ్డి అని కూడా అంటారు. అపుడెప్పుడో తన పెళ్లి పత్రిక పై జై తెలంగాణ అని ముద్రించుకున్నాను అని ఎప్పుడు డబ్బా కొడుతూ ఉంటారు. ఇక ఇంకో మహా నాయకుడు, నిన్నటి వరకు తెదేపా లో నంబర్ టూగా ఉన్న తూల్ల దేవేందర్ గౌడ్ తెలంగాణ కోసం ప్రత్యేక పార్టీ పెట్టిన ఘనత. ఇంకా మిగత నాయకులు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర రావు పొద్దున లేస్తే తెలంగాణ జపం. ఒకరిని మించిన నేపథ్యం ఒకరిది . కాని నేడు ఒక్కరూ అంటే ఒక్కరూ కూడా తెలంగాణ పై మాట్లాడటం లేదు. పార్టీ నుంచి బయటకి రావటం అటుంచి కిక్కూరు మనటంలేదు. అది వారు నాయకుడికి చూపిస్తున్న విధేయత అనుకుంటున్నారు. కానీ అదే నాయకుడి ఆంధ్ర, రాయలసీమ అనుచరగణం చంద్రబాబు ని లెక్కచేయకుండా రోడ్ల వెంట పడి బస్సు యాత్రలు చేస్తున్నారు. ఇది సీమంధ్ర నాయకుల తిరుగుబాట? లేక తెలంగాణ తెలుగు దేశం నాయకుల చేతకాని తనమా?? లేక తెలంగాణ ప్రజల దౌర్బాగ్యమా ???

1983 లో తెలుగువాడి ఆత్మ గౌరవం అంటూ సినిమా ఫక్కిలో వచ్చిన పార్టీ ఇది. తెలంగాణ వాదాన్ని వినిపించనీయకుండా రకరకాల డ్రామాలు చేసిన పార్టీ ఇది. తన తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ అనే పదం ఉచ్చరించనీయకుండా చేసిన నిరంకుశ నాయకుడు చంద్రబాబు. అయిదేళ్ళు అధికారానికి దూరమవటంతో ఇష్టం లేకున్నా 2009 లో తెలంగాణ పల్లవి అందుకున్న నయవంచక నాయకుడు చంద్రబాబు. ఒకపక్క సీమంధ్ర నాయకుల దీక్షలను, బస్సు యాత్రలకు నిర్దేశన చేస్తూ మరోపక్క తెలంగాణ ప్రజలను తనకు వచ్చిన మోసపు విద్య ను ప్రదర్శిస్తున్నాడు.

అయితే ఈరోజు నాయకుడిని లెక్క చేయకుండా రాజీనామాలు చేసిన తెలంగాణ భూమి పుత్రులు రేవూరి ప్రకాష్ రెడ్డి, గంగుల కమలాకర్, చెన్నమనేనీ రమేష్ లను చూసి మిగత నాయకులు బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. తెలంగాణ ఓట్లతో గెలిచిన, గెలవాలనుకున్న తెలంగాణ 'తెగులు' దేశం నాయకులు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు నేటి తెలంగాణ ప్రజలు.

No comments:

Post a Comment