మన తెలంగాణ వాళ్ళు ముందు జేసేది ఎనక, ఎనక జేసేది ముందు చేస్తుంటారు.దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాల ధ్వంసం,వాటిని అవమానించడం.ఇంతకాలం హైదరాబాదులోనే అమరజీవి విగ్రహాలున్నాయనుకున్నా, కాని ద్వంసమైన విగ్రహాల వార్తలు చూస్తుంటే తెలంగాణ జిల్లాలోకూడా వారి విగ్రహాలున్నట్లు తెలుస్తున్నది. మద్రాసు రాజధానిగా కలిగిన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకొరకు (వేర్పాటు కొరకు) ఆమరణ నిరాహార దీక్షపూని అసువులు బాసి అమరజీవి ఐనారు శ్రీరాములుగారు. ఐతే ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పాటయ్యి 1956 డిశంబర్ వరకు కొనసాగింది, కాని మద్రాసును రాజధానిగా సాధించలేకపొయ్యింది.సరే ఆ విషయం అట్ల ఉంచుదాం.అమరజీవి విగ్రహాలను తెలంగాణవాదులు చెప్పులతో అవమానించడం,వాటిని ధ్వంసం చెయ్యడంలో హేతుబద్ధతను విష్లేంచి అర్ధం చెసుకుందాం.ఏమాత్రం తెలంగాణలో జరిగిన మంచి,చెడు పాలనకు గాని,ఆపాలన వల్ల తెలంగాణ వారికి జరిగిన కష్ట-సుఖాలకుగాని లేదా వారి లాభ నష్టాలకు గాని శ్రీరాములు గారికి సంబంధం లేదు. అసలు ఆయన చనిపోయిన పిదప కదా! ఆ.ప్ర. రాష్త్రం ఏర్పడింది,కనుక అమరజీవి ఈతెలంగాణ ప్రాంతానికి నష్టమూ చెయ్యలేదు,లాభమూ చెయ్యలేదు.
- Ramulu
Thursday, December 17, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment