Wednesday, December 2, 2009

నాలుగు ప్లాటూన్ల తో నిమ్స్ వద్ద భద్రత



డీఎస్పీ రవి వర్మ ఆధ్వర్యంలో నాలుగు ప్లాటూన్ల తో నిమ్స్ వద్ద భద్రత ను నిర్వహిస్తున్నారు. నిమ్స్ కు ఉన్న మూడు గేట్ల తో సహా అన్ని ప్రాంతాలను సాయుధ పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. ఆసుపత్రి లో ఒక కరడుగట్టిన ఖైదీ లాగానో లేదా ముంబై మీద దాడి చేసిన ముష్కరుల కు భద్రత కల్పించినట్టు అతి చేస్తున్నారు. పోలీసులు చెప్తున్నట్టు 250 సాయుధ పోలీసులే కాకుండా మఫ్టి లో లెక్కలు మిక్కిలి ఉన్నారు.

అలాగే కేసీఆర్ ను కలవటానికి వచ్చే అందరి పై పోలీసులు డేగ కన్ను వేశారు. ఉస్మానియా విద్యార్థులు కానీ లేదా మరే ఇతర వ్యక్తులను కూడా కోర్టు అనుమతి లేకుండా కలవనీయమని పోలీసులు చెప్తున్నారు. పాతిక - ముప్పై ఏళ్లుగా ప్రజా ప్రతినిధి గా ఉన్న ఒక బక్క పలచని వ్యక్తి కి ప్రభుత్వం ఇంతగా ఎందుకు భయపడుతుందో తెలియటం లేదు.

No comments:

Post a Comment