Wednesday, December 9, 2009

తెలంగాణ కు శుభ పరిణామాలు

నేడు (బుధవారం నాడు) ఒక్క కేసీఆర్ ఆరోగ్యం మినహా అనేక శుభపరిణామాలు జరిగాయి. అవి.....

  • పార్లమెంట్ లో తెలంగాణ ప్రకంపనలు: తెలంగాణ పై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని మెజారిటీ పార్టీలు ప్రభుత్వాన్ని కోరాయి. అద్వానీ ప్రవేశ పెట్టిన తెలంగాణ అంశం పై చర్చ జరిగింది. ఒకటి రెండు పార్టీ లు మినహా అందరు తెలంగాణ కు అనుకూలంగాను కేసీఆర్ దీక్ష విరమించాలని కోరారు.
  • కొపెన్ హేగన్ నుంచి తిరిగి వచ్చిన ప్రధాన మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
  • కాలేజీలను, హాస్టళ్లను మూసివేయడాన్ని హై కోర్టు తప్పు బట్టింది. వెంటనే తిరిగి తెరవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రేపు జరగనున్న శాంతి రాలీ కి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై విద్యార్థులు అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేయు లో విద్యార్థులు పాటలు పాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
  • ఈరోజు మధ్యాన్నం తరవాత సోనియా గాంధీ కోర్ కమిటీ సమావేశం జరపాలని నిర్ణయం.
  • ఎట్టకేలకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు నోరు తెరిచారు. జానా రెడ్డి, దామోదర్ రెడ్డి ల నాయకత్వం లో 29 మంది ఎం ఎల్ ఏ లు సంతకాలు చేసి సోనియా కు ఉత్తరం రాశారు. అలాగే రేపు జరిగే శాంతి యాత్రకు తమ మద్దతు తెలిపారు.
  • నగరానికి చెందిన విష్ణు, శంకర్ రావు, కొండ సురేఖ లు సంతకాలు చేయగా దానం, ముఖేష్, మర్రి, భట్టి తదితరులు సంతకాలు చేయలేదు. తెలంగాణ కు చెందిన 10 మంది మంత్రులు ఇదివరకే సోనియాకు నివేదించుకున్న సంగతి తెలిసిందే.
  • ఈటెల రాజేందర్, హరీష్ రావుల నాయకత్వంలో తెరాస ఎంఎల్ఏ లు శాసన సభ ను స్తంభింప చేశారు. తరవాత గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు, వీరికి బిజెపి, పీఆర్‌పీ, సీపీ ఐ లు మద్దతు పలికారు.
  • ఏబీవీపీ విద్యార్థులు శాసన సభ ను మెరుపు ముట్టడి చేశారు. చివరికి ఈ చర్యను భగ్నం చేసినా ఊహించని పరిణామానికి పోలీసులు గాభరా పడ్డారు.
  • నేడు ప్రెస్ క్లబ్ లో గద్దర్, అల్లం నారాయణ, పాశం యాదగిరి లతో సహా అనేక మంది కళాకారులు, ప్రజా సంఘాలు కేసీఆర్ ను దీక్ష విరమించుకోవాలని, రేపు జరుగు శాంతి యాత్రను విజయవంతం చేయాలని కోరాయి.

మరోపక్క కేసీఆర్ ఆరోగ్యం మాత్రం వేగంగా క్షీనిస్తుంది. డాక్టర్లకు, చికిత్స కు సహకరించటం లేదని తెలుస్తుంది. అసెంబ్లీ లో తీర్మానం పెట్టె వరకు బెట్టు వీడేడి లేదని కేసీఆర్ పట్టు పట్టారు.

No comments:

Post a Comment