Wednesday, December 2, 2009

కేసీఆర్ నిమ్స్ కి తరలింపు

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అర్ధరాత్రి కేసీఆర్ ను హైదరాబాద్ నిమ్స్ కు 108 అంబులెన్స్ లో తరలలిస్తున్నారు. తెల్లవారితే తెరాస శ్రేణుల తాకిడి ఉంటుందని అర్ధరాత్రి తరలిస్తున్నారు. సూర్యాపేట - నార్కెట్ పల్లి ల ద్వారా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. కేసీఆర్ వెంట కొడుకు తారక రామ రావు, అల్లుడు హరీష్ రావులు ఉన్నారు. అయితే తాజా పరిస్థితుల బట్టి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగా దిగజారిందని, రక్తం లో షుగర్ లెవెల్స్ పడిపోయి కీటోన్స్ పెరిగాయి అని తెలుస్తుంది.




ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మూత్ర పిండాలపై ప్రభావం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. మొదట హెలికాప్టర్ లో తరలిస్తారని భావించినా ఇప్పుడు రోడ్డు మార్గం గుండా తరలిస్తున్నారు. కాన్వాయి లో సుమారు పాతిక వాహనాలు ఉన్నాయి. అయితే ఈ తరలింపు ను తెరాస నాయకులే కోరినందున మార్గ మధ్యoలో ఎటువంటి ఆటంకం ఉండక పోవచ్చని భావిస్తున్నారు.

గత మూడు రోజులుగా తెరాస వర్గాలు ఎంతగా డిమాండ్ చేసిన స్పందించని ప్రభుత్వం చివరకు మానవ హక్కుల కమీషన్ ఆజ్ఞలకు తలొగ్గాల్సి వచ్చింది. కేసీఆర్ హైదరాబాద్ కు రావటం తెరాస కు, ఉద్యమానికి నైతిక బలం చేకూరుతుంది.

No comments:

Post a Comment