Thursday, November 26, 2009

తలసాని ప్రగాల్బాలు పారలేదు

తనను తాను ఎక్కువగా ఊహించుకునే లష్కర్ ఉత్తర కుమారుడు గ్రేటర్ ఎన్నికల లో కుదేలైపోయాడు. సెట్లర్ల కు అండగా ఉంటాను,ఏ సమయన్నైనా నాకు ఫోన్ చేయొచ్చు, కేసీఆర్ ఇల్లు ఖాళీ చేయిస్తాను అని బీరాలు పలికిన తలసాని ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్ కు సికింద్రా బాద్ ప్రజలు తల బొప్పీ కట్టించారు.

ఒక పక్క శివారు ప్రాంతాల్లో తెలుగు దేశం తన ఉనికి ని చాటుకోగా సికింద్రాబాద్ లో మాత్రం దాదాపు అన్ని స్థానాలలో ఓడిపోయింది. ఆరు నెలల క్రింద జరిగిన శాసన సభ ఎన్నికల లో నాన్ లోకల్ అయిన జయసుధ చేతిలో దెబ్బయి పోయిన తలసాని కి తలబిరుసు ఏ మాత్రం తగ్గలేదు.తెలంగాణ పదం ఎవరు ఉచ్చరించినా ఇల్లెత్తు ఎగిరే తలసాని కి గ్రేటర్ ఫలితాల ద్వారా తగిన శాస్తి జరిగింది అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.

No comments:

Post a Comment