కేసీఆర్ దీక్షకు రాష్ట్ర ప్రముఖులు పలువురు రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలుపుతున్నారు. వీరిలో మంద కృష్ణ మాదిగ ఏకంగా కేసీఆర్ తో పాటు దీక్షలో కూర్చుంటానని చెప్పారు. ప్రజారాజ్యం మహిళా అధ్యక్షురాలు శోభ రాణి కూడా దీక్షకు సంఘీభావం తెలిపారు, అయితే ఇది తన సొంత అభిప్రాయమని అన్నారు. కళాకారులు అందె శ్రీ, సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి లాంటి వారు కూడా మద్దతు తెలిపారు.
ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు మధు యాష్కీ, వెంకట స్వామి లు ఇదివరకే మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే వీరిని మరో కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వం ఒకపక్క పోలీసులను చివరి వరకు సంయమనం పాటించాలని చెప్తూ, మరో పక్క ఇప్పుడున్న పోలీసులకు తోడు ఒక ప్లాటూన్ సుశిక్షిత గ్రేహౌండ్స్ దళాలను రంగంలోకి దింపారు. సీనియర్ అధికారులైన ఐజీ మీనా, లడ్దా, ఇక్బాల్, జయ లక్ష్మి లాంటి అధికారులులను కేసీఆర్ పై ఉసిగొల్పుతున్నారు.
Saturday, November 28, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment