Wednesday, November 25, 2009

అష్ట దిగ్బంధంలో సిద్ధిపేట

మెతుకు సీమ ముఖ్య పట్టణం, తెలంగాణ పోరు గడ్డ సిద్ధిపేట నేడు అష్ట దిగ్బంధనం లో ఉంది. దీక్ష రోజైన ఇరవై తొమ్మిది కి ఇంకా మూడు రోజులు ఉండగానే సిద్ధిపేటలో ఆరు వేల పోలీసులను మోహారించారు. రాయలసీమ కు చెందిన ఒక ఐజీ ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో ఎస్పీ లు, వందల సంఖ్యలో ఇన్‌స్పెక్టర్లు, వేల సంఖ్య లో పోలీసులను దించారు. సిద్ధిపేట కు ఎనిమిది దిక్కులా అన్ని దారులు మూసివేశారు. పట్టణం లో 144 సెక్షన్ తో పాటు పలు నిషే దాజ్ఞలు విధించారు.

ఇది ఇలా ఉంటే ఆరునూరైన నిరాహార దీక్ష లో కూర్చుని తీరుతానని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అనితర సాధ్యమైన వ్యూహాలను రచించే సామర్థ్యం ఉన్న కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు కు ఇది పరీక్షా సమయం. పోలీసులను బురిడి కొట్టించడానికి చివరి నిమిషం లో దీక్షా వేదిక ను మార్చిన ఆశ్చర్యం లేదు. రెండు రోజుల ముందు కరీం నగర్ కు బయలు దేరి వెళ్తున్న కేసీఆర్ హైదరాబాద్ లో మీడియా తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రోశయ్య డీజీపీ గిరీష్ కుమార్ పై నిప్పులు కురిపించారు.

ఏది ఏమైన నేడు దేశం మొత్తం కాకుండా ప్రపంచం లో ఉన్న తెలుగు వారు అంతా నేడు సిద్ధిపేట వైపు చూస్తున్నారు.

No comments:

Post a Comment