Thursday, November 26, 2009

సిద్దిపేట పోలీసుల జై తెలంగాణ

సిద్దిపేట లో కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడానికి తరలించిన పోలీసు బలగాలు జై తెలంగాణ నినాదాన్ని అందుకున్నాయి. సిద్దిపేట మార్కెట్ యార్డ్ లో బస చేస్తున్న పోలీసులను చూడటానికి స్థానిక ఎం ఎల్ ఏ, తెలంగాణ రాష్ట్ర సమితి యువ కిశోరం హరీష్ రావు వచ్చిన సందర్భం లో ఈ సంఘటన జరిగింది. వేలాది గా తరలి వచ్చిన పోలీసులకు భోజన సదుపాయం కల్పించలేక పోయిన పోలీసు బాసులు వీరినందరిని స్థానిక మార్కెట్ యార్డ్ కు తరలించారు.

అయితే అప్పటికే ఆకలి తో నకనక లాడుతున్న పోలీసులను ఉద్ధేశించి హరీష్ మాట్లాడుతూ మీరు మా అతిథులు, మేము మీకు భోజన సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పినప్పుడు పోలీసులంతా ముక్త కంఠం తో జై తెలంగాణ అని నినదించారు. వీరికి హరీష్ ఒక విజ్ఞప్తి చేస్తూ మీరు మీ డ్యూటీ చేయండి కానీ లాటి ఛార్జ్ లాంటివి చేయాల్సి వస్తే కింద నేల పై కొట్టమని కోరారు. అలాగే కింది స్థాయి పోలీసులకు తెలంగాణ వస్తేనే మంచిది అని ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను వివరించారు.

దీనితో ఒకటి చేయ తలచి భారీ బలగాలను దించితే ఇంకోటి జరిగింది పోలీసు అధికారులు తలలు పట్టుకున్నారు.

No comments:

Post a Comment