బక్క పలచ గా ఉన కేసీఆర్ ను కాకుండా దీక్షలో మధు యాష్కీ ని కూర్చోమని ఎద్దేవా చేసిన జీవన్ రెడ్డి పై కేసీఆర్ నిప్పులు చిమ్మారు. మధు యాష్కీ ని దున్నపోతు తో పోల్చుతూ వ్యాఖ్య చేసిన జీవన్ రెడ్డి ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ నువ్వు కూడా దున్నపోతు లాగా ఉన్నావు, నువ్వూ తెలంగాణ లో పుట్టి నోడివే కదా నువ్వు వచ్చి దీక్ష లో కూర్చోమని సూచించారు.
ఒకప్పుడు కరీం నగర్ జిల్లా లో ఎదురులేని నాయకుడు గా చలామణి అయిన జీవన్ రెడ్డి మొదట తెలంగాణ పల్లవి ని ఎత్తుకున్న వారిలో ఒకరు. తెరాస ఆవిర్భావం తో మరుగున పడ్డాడు. వైఎస్ కాంపులో దూరిన తరవాత రెచ్చిపోయి కేసీఆర్ తో తలపడ్డారు. ప్రతీసారి మట్టి కరుస్తూ పోయారు. దీనితో తెలంగాణ అన్నా తెలంగాణ కోరేవాళ్ళన్నా జీవన్ రెడ్డి కి మంట. సొంత పార్టీ లో తెలంగాణ పై గళమెత్తే యువ నాయకుడు మధు యాష్కీ పై ఈ మధ్య సమయం దొరికినప్పుడల్ల అక్కసు ను చూపిస్తున్నారు.
దున్నపోతు మీద వాన చందాన గత అరవై ఏళ్లుగా తెలంగాణ పై మోసగిస్తూ వస్తున్న కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున జీవన్ రెడ్డి దున్నపోతా, లేక అలాంటి పార్టీ లోనే ఉంటూ తెలంగాణ పై మడమ తిప్పకుండా మాట్లాడుతున్న మధు యాష్కీ దున్న పోతా తేల్చుకోవాల్సింది తెలంగాణ ప్రాంత ప్రజలే.
Thursday, November 26, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment