Tuesday, December 22, 2009

కసబ్ ని మరిపించిన రాజగోపాల్ - కేసీఆర్


విజయవాడ లో మాయం అయ్యి హైదరాబాద్ నిమ్స్ లో ప్రత్యక్ష్యమైన లగడపాటి రాజగోపాల్ ను ముంబై మీద దాడి చేసిన అజ్మల్ కసబ్ తో పోల్చారు తెరాస అధినేత కేసీఆర్, ఈ విషయాన్ని తన సహచరుడు విజయరామారావు తనతో అన్నారని తెలంగాణ భవన్ నుండి చేసిన ప్రసంగం లో పేర్కొన్నారు.

నా దిష్టి బొమ్మలు ఇంకా తగలబెట్టండి: కేసీఆర్

సీమాంధ్ర లో తన దిష్టి బొమ్మల దహనం పై తెరాస అధినేత స్పందించారు. తన దిష్టి బొమ్మలు ఇంకా పెద్ద ఎత్తున తగలబెట్టాలని, దానితో తనకు ఉన్న దిష్టి పోయి ఆయుషు పెరుగుతుందని అన్నారు.

సమైక్యాంధ్ర ఎందుకు కావాలి అని ఆందోళనకారులను అడిగితే వారి దగ్గర జవాబు లేదన్నారు. వారికి తెలిసిన జవాబు అస్తమానం కేసీఆర్ డౌన్ డౌన్, దిష్టి బొమ్మలు తగలబెట్టాడమే అని ఎద్దేవా చేశారు.

త్వరలో: తెలంగాణనౌ.కామ్

Monday, December 21, 2009

లగడపాటి పరుగు పందెం



సలాం అమరులారా - మిత్ర (అమర్)

పల్లవి: బలిపీఠ మెక్కవద్దురా
ఆత్మార్పణ లింకొద్దురా
త్యాగాల చరిత మనదిరా
పొరాడి గెలువసాగరా
జై తెలంగాణ-జై తెలంగాణ
జై తెలంగాణా
"బలిపీఠం"
శ్రీకాంత్ దేహమెందుకు
పెనుమంటలల్లో కాలెను
పోలీస్ కిష్టయ్య తన
ప్రాణ మెందుకిచ్చెను
మల్లేషం మంజులలు భార్యభర్తలయ్య
మూడు పదులు దాటిన ప్రేమ ముర్తులయ్య
ఎన్నేండ్లు వేదనంటూ
మాగుండె కోతనంటూ
ప్రశ్నించెవారి మరణం
ఇక మిశ్రమించలేము
సలాం అమరులారా-సలాం అమరులారా
సలాం అమరులారా ........
"బలిపీఠం"
డిసెంబర్ తొమ్మిదొక
చీకటి రోజందుమా
పదకొండు గురి త్యాగపు
వెలుగు రేఖ లందుమా
విశ్వవిద్యాలయాల విద్యర్థుల పిడికిల్లు
వీధులన్ని అట్టుడికిన ప్రజా పోరు కెరటాలు
ఉరికొయ్య తీగవద్దు
పోరాటమాపవద్దు
పార్లమెంటు బిల్లుదాక
సల్లారదు మాకాక
సలాం అమరులారా-సలాం అమరులారా
సలాం-అమారులార......
"బలిపీఠం"

Saturday, December 19, 2009

తెలంగాణ ధూం ధాం(ఓల్డ్): గద్దర్, రసమయి, అందెశ్రీ, దేశపతి

తెలంగాణ కు పట్టిన తెగులు తెలుగుదేశం పార్టీ

ఆయన పేరు నాగం జనార్ధన్ రెడ్డి, ఇప్పుడు పార్టీలో నంబర్ టూ(?) అని అంటారు. కాంగ్రెస్ వాళ్ళు, గిట్టని వాళ్ళు బియ్యం రెడ్డి అని కూడా అంటారు. అపుడెప్పుడో తన పెళ్లి పత్రిక పై జై తెలంగాణ అని ముద్రించుకున్నాను అని ఎప్పుడు డబ్బా కొడుతూ ఉంటారు. ఇక ఇంకో మహా నాయకుడు, నిన్నటి వరకు తెదేపా లో నంబర్ టూగా ఉన్న తూల్ల దేవేందర్ గౌడ్ తెలంగాణ కోసం ప్రత్యేక పార్టీ పెట్టిన ఘనత. ఇంకా మిగత నాయకులు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర రావు పొద్దున లేస్తే తెలంగాణ జపం. ఒకరిని మించిన నేపథ్యం ఒకరిది . కాని నేడు ఒక్కరూ అంటే ఒక్కరూ కూడా తెలంగాణ పై మాట్లాడటం లేదు. పార్టీ నుంచి బయటకి రావటం అటుంచి కిక్కూరు మనటంలేదు. అది వారు నాయకుడికి చూపిస్తున్న విధేయత అనుకుంటున్నారు. కానీ అదే నాయకుడి ఆంధ్ర, రాయలసీమ అనుచరగణం చంద్రబాబు ని లెక్కచేయకుండా రోడ్ల వెంట పడి బస్సు యాత్రలు చేస్తున్నారు. ఇది సీమంధ్ర నాయకుల తిరుగుబాట? లేక తెలంగాణ తెలుగు దేశం నాయకుల చేతకాని తనమా?? లేక తెలంగాణ ప్రజల దౌర్బాగ్యమా ???

1983 లో తెలుగువాడి ఆత్మ గౌరవం అంటూ సినిమా ఫక్కిలో వచ్చిన పార్టీ ఇది. తెలంగాణ వాదాన్ని వినిపించనీయకుండా రకరకాల డ్రామాలు చేసిన పార్టీ ఇది. తన తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ అనే పదం ఉచ్చరించనీయకుండా చేసిన నిరంకుశ నాయకుడు చంద్రబాబు. అయిదేళ్ళు అధికారానికి దూరమవటంతో ఇష్టం లేకున్నా 2009 లో తెలంగాణ పల్లవి అందుకున్న నయవంచక నాయకుడు చంద్రబాబు. ఒకపక్క సీమంధ్ర నాయకుల దీక్షలను, బస్సు యాత్రలకు నిర్దేశన చేస్తూ మరోపక్క తెలంగాణ ప్రజలను తనకు వచ్చిన మోసపు విద్య ను ప్రదర్శిస్తున్నాడు.

అయితే ఈరోజు నాయకుడిని లెక్క చేయకుండా రాజీనామాలు చేసిన తెలంగాణ భూమి పుత్రులు రేవూరి ప్రకాష్ రెడ్డి, గంగుల కమలాకర్, చెన్నమనేనీ రమేష్ లను చూసి మిగత నాయకులు బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. తెలంగాణ ఓట్లతో గెలిచిన, గెలవాలనుకున్న తెలంగాణ 'తెగులు' దేశం నాయకులు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు నేటి తెలంగాణ ప్రజలు.

విజయశాంతి కనబడుట లేదు

మీడియా వివక్ష కు ఇంకో నిదర్శనం

చిరంజీవి తెలంగాణ పై మాట మార్చినందుకు కలత చెంది పీఆర్‌పీ కార్యకర్త కొమరా రెడ్డి(చిరంజీవి అభిమాని) ఆత్మహత్య చేసుకుంటే స్క్రాలింగ్ మాత్రమే వేసి, చిత్తూరు లో సమైక్య ఉద్యమానికి మద్దతుగా ఆత్మహత్య చేసుకున్న యువకుని వార్తను బ్రేకింగ్ న్యూస్ గా వేస్తున్న దృశ్యం ఈ క్రింద చూడవచ్చు.

టీవీ9 లో కేసీఆర్ - కొశ్చన్ హవర్







Friday, December 18, 2009

సేవ్ తెలంగాణ లో పాల్గొన్న ప్రవాసుల అరెస్ట్

రాష్ట్రం పేరును తెలంగాణ గా మార్చినా అభ్యంతరం లేదు - లగడపాటి

రాష్ట్రం పేరును తెలంగాణగా మార్చినా అభ్యంతరం లేదు అని ప్రకటించిన లగడపాటి రాజగోపాల్ ను చూస్తే నవ్వాలో ఎడ్వాలో తెలియటంలేదు. ఆంధ్ర - తెలంగాణ లను కలిపినప్పుడు రాష్ట్రం పేరు తెలంగాణాంధ్ర ప్రదేశ్ గా ఉంచాలని ఇక్కడ నిర్ణయించి ఢిల్లీ కి వెళ్లేసరికి పేరు మార్చి పారేసీన ఆంధ్ర నాయకులకు వారసుడైన లగడపాటి ఇంకో కుట్రకు తెరలేపాడు. తిమ్మిని బమ్మి చేసయినా రాష్ట్ర ఏర్పాటు ను ఆపాలని లగడపాటి లాంటి నాయకుల ఆరాటం చూస్తే నవ్వొస్తుంది.

మ్యూజిక్ సిట్టింగ్: సమైక్యాంధ్ర కొత్త గోడలెందుకుయ్య కడ్తవు....

తెలంగాణ పై మీడియా కు చిన్న చూపు ఎందుకు ?

ఏ ఉద్యమానికైన మీడియా సహకారం అత్యంత కీలకం. పత్రికలు, టీవీ ఛానళ్లు, వెబ్ సైట్లు పుంఖాను పుంఖాలుగా పుట్టుకొచ్చిన నేటి తెలుగు సమాజంలో తెలంగాణ ఉద్యమం పట్ల ఉన్న వివక్ష అందరికి తెలిసిందే. దీనికి ముఖ్య కారణం తెలంగాణ కు చెందని మీడియా సామ్రాజ్యం. ఒకటి అరా చానళ్లు, పత్రికలు ఈ ప్రాంతానికి చెందిన వారివైనా... వారు ఉద్యమానికి తోడ్పడుతున్న పాత్ర పరిమితం అని చెప్పవచ్చు. రాగ ద్వేషాలకు, పక్షపాతానికి అతీతంగా వ్యవహరించవలసిన మీడియా స్వప్రయోజనాలకు, ప్రాంతాభిమానానికి దాసోహం అయిపోయింది. తెలంగాణ వస్తే తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుందనే భయమే ఈ వివక్షకు ప్రధాన కారణం. వివక్ష ఉంది అనటానికి రెండు చిన్న ఉదాహరణలు.

1. చిరంజీవి సమైక్యవాద గళం విప్పగానే అతని అల్లుడు శిరీష్ భరద్వాజ్ తెలంగాణ కు జై అనటం మీడియాలో స్క్రోలింగ్ కొన్ని నిమిషాలు తప్ప ఎక్కడా వార్తలు రాలేదు. అదే లగడపాటి కి మద్దతు గా విజయవాడ శిబిరానికి వచ్చిన వరంగల్ యువకుడిని హైలైట్ చేశారు.
2. కేసీఆర్ నిరాహార దీక్ష మీద అవాకులు చెవాకులు మాట్లాడి ఆర్భాటంగా ప్రకటించి తిరుపతిలో చేపట్టిన 'ఒక పూట' దీక్షను మధ్యాన్నం మూడింటికే ముగించి శిబిరంలో నిరుత్సాహం నింపిన మోహన్ బాబు గురించి కూడా ఎక్కడా వార్త రాలేదు. పైగా మోహన్ బాబు విసిరిన 'ఇంటి మీద రాళ్లు వేయించుకునే' సవాలుకు ప్రాముఖ్యం ఇచ్చారు. ఇవి రెండు చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి కోకొల్లలు.

ముఖ్యమంత్రి మొదలుకుని ప్రభుత్వ,పాలనా యంత్రాంగం అన్ని(దాదాపు)పార్టీలు చూపిస్తున్న వివక్షకు తోడు నిస్వార్థం గా ఉండాల్సిన మీడియా కూడా వీరికి తోడవటం సగటు తెలంగాణ పౌరుడి మనస్సు చివుక్కుమంటుంది.

చంద్రబాబు యూస్ అండ్ త్రో కింగ్: కేసీఆర్

Thursday, December 17, 2009

కోస్తా వాళ్ళు దొంగలు: కత్తి పద్మా రావు (ఓల్డ్ వీడియో)

ఓ తెలంగాణ వాడి ఆవేదన

పదండి ముందుకు పదండి ముందుకు మన రాష్ట్ర పునర్ నిర్మాణానికి
బంగారం లాంటి మన తెలంగాణ గుడిసెను, బంగళాలగ మారుస్తమని
మనల్ను బజారులొ ఎమి చేయలేని వాళ్ళను చేసారు
తెలంగాణ ప్రజలు కోస్తా రాయలసీమ నాయకుల జిత్తులకు ఎత్తులు వేసే మొగుళ్ళు
నలబై సంవత్సరాల జి .ఓ లను పండ బెట్టి
రాత్రికి రాత్రి ఎన్ని కోర్టులు చెప్పిన వినకుండా
జి.ఓ లు లేని ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు
అధికార అహంకారముతొ మా నీళ్ళను మరియు అన్ని వాటాలను తీసుక వెల్తున్నారు
నాడు ఒకడు, నేడు ఒకడు, రేపు మరొకడు ఏన్నాల్లు ఇలా
ఇదేనా సమ న్యాయం అంటే
నిజం మాట్లాడమంటె నా తెలుగు అన్నదమ్ములు అంటారు
ఒక్క తల్లి బిడ్డలం అంటారు
తెలంగాణ రక్తం ఆత్మల పుట్ట
తెలంగాణ తల్లి సవితి బిడ్డను తన బిడ్డగా భావించె తల్లి
ఎక్కడరా సమైక్య, ఎవడురా సమైక్య అనేది
ఎన్నాల్లు ఈ ద్రుతరాష్ట్ర పాలన మాకు
ఇన్నిరోజుల ద్రుతరాష్ట్ర పాలనకు నిదర్షనం
ఆర్ధికంగా లేని మా తెలంగాణ ఎం.ఎల్.ఏ మరియు ఎం.పి లను లొంగదీసుకొవడం
ఆంధ్ర ప్రదేశ్ లో ఏ పదవికి ఛివరికి
ఏ కుల సంఘం పెద్దమనిషి తనానికి అర్హత లేదా మాకు
నాడు నిజాముకు నేడు నీకు గులాంగిరికేన మేము పుట్టింది, పుట్టేది
ఫుట్టారు నీ ఎత్తులకు పై ఎత్తులు వేసే " చంధ్ర శేఖరా" “మధు” కుసుమాలు
కలుస్తాం మేము అందరం ఒక్క తాటిపై
మసులుతుంది మా యువ రక్తం
కదులుతుంది సమర శంఖం చూడురా తెలంగాణ వాడి దెబ్బ

త్వరలో మన తెలంగాణ రాష్ట్ర పునర్ ఏర్పాటు అనే చిన్ని ఆశ నెరవేరుతుంది అని ఆశిస్తూ………

-అజయ్ తిప్పని

పార్లమెంట్ ఆవరణ లో తెలంగాణ - సీమాంధ్ర సభ్యుల వాగ్వాదం